సొంత పార్టీపై విమర్శలు చేసి బీజేపీలో చేరేందుకు నిర్ణయించుకున్న మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి త్వరలోనే కాషాయ తీర్థం పుచ్చుకోనున్నారు. ఢిల్లీలో ఇవాళ బీజేపీ ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్తో కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి చర్చలు జరిపారు. ఇవాళో రేపో కండువా మార్చుకునేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది.