Hyderabad: కోట్లు కురిపించిన కోకాపేట్ భూములు

హైదరాబాద్‌లో హాట్ కేక్‌లా అమ్ముడుపోయిన ప్రభుత్వ భూములు ఎకరం రూ.100కోట్లు దాటే అవకాశం ఉందని అంచనాలు

Update: 2021-07-15 16:15 GMT

కోకాపేట్ భూములు (ఫైల్ ఫోటో)

Hyderabad: భాగ్యనగరంలో ప్రభుత్వ భూములు హాట్‌ కేకుల్లా అమ్ముడుపోతున్నాయి. ఇవాళ కోకాపేట్ నియో పాలిస్ భూముల వేలంలో ధరలు రికార్డులు సృష్టించాయి. ఎచ్ ఎమ్ డి ఏ భూములు ఏకంగా ఎకరం 60కోట్ల వరకూ పలికాయి. మొత్తం 49ఎకరాలకు వేసిన వేలంలో రికార్డుస్థాయి ధరలు పలికినట్లు అధికారులు తెలిపారు. మరోవైపు.. రేపు హైటెక్ సిటీ, కూకట్ పల్లి మధ్యలో ఉన్న టీఎస్ఐఐసి భూములను అధికారులు వేలం వేయనున్నారు. కోకాపేటలో కోట్లు పలకడంతో రేపటి వేలంలో ఒక్కో ఓకరం వంద కోట్లు దాటుతాయన్న అంచనాలు వ్యక్తమవుతున్నాయి. 

Tags:    

Similar News