కాశ్మీర్లో 70 ఏళ్లుగా రాజ్యాంగ విరుద్ద పాలన కొనసాగిందని ప్రజలకు రిజర్వేష్లన్ల ఫలాలు అందలేదని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్రెడ్డి అన్నారు. ఆర్టికల్ 370 రద్దుతో కాశ్మీర్ ప్రజలు పూర్తి స్వేచ్ఛ అనుభవిస్తారని.. అన్ని రిజర్వేషన్లను కాశ్మీర్ ప్రజలకు దక్కుతాయని చెప్పారు. ప్రస్తుతం కాశ్మీర్లో శాంతి భద్రతల అదుపులో ఉన్నాయన్న ఆయన కాశ్మీర్ లో కర్ఫ్యూ సడలించామని తెలిపారు.