Kishan Reddy: వాతావరణ శాఖ హెచ్చరించినా..జీహెచ్ఎంసీ అలర్ట్గా లేదు
Kishan Reddy: నాలాలో పడి మౌనిక చనిపోవడం బాధాకరం
Kishan Reddy: వాతావరణ శాఖ హెచ్చరించినా..జీహెచ్ఎంసీ అలర్ట్గా లేదు
Kishan Reddy: సికింద్రాబాద్ కళాసిగూడ నాలాలో పడి చిన్నారి మౌనిక మృతి చెందడం బాధాకరమని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. కాంట్రాక్టర్లకు జీహెచ్ఎంసీ బకాయిలు చెల్లించకపోవడంతో... నాలాల నిర్వహణ సరిగా లేకనే ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయని ఆరోపించారు. భారీ వర్షం వస్తుందని వాతావరణ శాఖ హెచ్చరించినా... జీహెచ్ఎంసీ సిబ్బంది అలర్ట్గా లేరని మండిపడ్డారు. నాలాల నిర్వహణలో జీహెచ్ఎంసీ సిబ్బంది లోపం కారణంగానే ఈ ఘటన జరిగిందన్న ఆయన... మౌనిక కుటుంబాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు.