Kishan Reddy: అయోధ్య విషయంలో కాంగ్రెస్ తీరు సరికాదు

Kishan Reddy: పార్లమెంట్ సమావేశాలు, ఎన్నికల కమిషన్‌నూ బహిష్కరిస్తారు

Update: 2024-01-11 14:15 GMT

Kishan Reddy: అయోధ్య విషయంలో కాంగ్రెస్ తీరు సరికాదు

Kishan Reddy: అయోధ్య విషయంలో కాంగ్రెస్‌ తీరు సరికాదని, ఆ పార్టీ హిందూ వ్యతిరేకి అంటూ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు టీబీజేపీ చీఫ్ కిషన్‌రెడ్డి. జనవరి 22 కోసం దేశ ప్రజలందరూ ఎదురుచూస్తున్నారని, అయోధ్య ప్రాణప్రతిష్ట కార్యక్రమాన్ని కాంగ్రెస్ తిరస్కరించడం కరెక్ట్‌కాదన్నారు. బహిష్కరించడం కాంగ్రెస్‌కు అలవాటైందన్న కిషన్‌రెడ్డి.. ప్రణబ్ ముఖర్జీకి భారత రత్న ఇస్తే బహిష్కరించారన్న విషయాన్ని గుర్తుచేశారు. అలాగే.. పార్లమెంట్ సమావేశాలు, ఎన్నికల కమిషన్‌ను కూడా కాంగ్రెస్‌ బహిష్కరిస్తుందని ఫైర్‌ అయ్యారు కిషన్‌రెడ్డి.

Tags:    

Similar News