ఖమ్మం లేబర్ ఆఫీసర్ కిడ్నాప్ వెనక ఏం జరిగింది.. అడవుల్లో ఆగిన సిగ్నల్స్..

Update: 2020-03-10 10:15 GMT
ఖమ్మం లేబర్ ఆఫీసర్ కిడ్నాప్ వెనక ఏం జరిగింది.. అడవుల్లో ఆగిన సిగ్నల్స్..

ఖమ్మం జిల్లా లేబర్ ఆఫీసర్ ఆనంద్ రెడ్డి కిడ్నాప్ వ్యవహారం పోలీసులకు సవాల్ గా మారింది. ఈనెల ఏడోతేదీన ఆనంద్ రెడ్డి అతని స్నేహితుడు ప్రదీప్‌రెడ్డితో కలిసి బయటకు వెళ్లారు. తిరిగి ఇంటికి రాలేదు ఆ రోజు నుంచి నాలుగు రోజులుగా ఆచూకీ లేకపోవడంతో కుటుంబసభ్యులు ఆందోళన చెందుతున్నారు. ఆనంద్ రెడ్డి అదృశ్యంపై కుటుంబసభ్యులు హన్మకొండ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కమలాపూర్ కు చెందిన ఓ ఇసుక కంట్రాక్టర్ కిడ్నాప్ చేసినట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. బాధితుడి కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. భూపాలపల్లి అడవి దగ్గర ఆనంద్ రెడ్డి ఫోన్ సిగ్నల్ నిలిచిపోయింది. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.


Full View

 

Tags:    

Similar News