టిక్ టాక్ ఇప్పుడు ఇది చిన్న పెద్ద అని తేడా లేకుండా ప్రతి ఒక్కరు దీనికి అలవాటు పడిపోయారు . అలవాటు అనడం కూడా చాలా చిన్న మాట అవుతుంది . బానిసలు అయ్యారనే చెప్పడం కరెక్ట్ .. అయితే తాజాగా ఖమ్మం కార్పోరేషన్ లో అధికారాలు వారు చేయాల్సిన పనిని పక్కన పెట్టి టిక్ టాక్ లో మునిగి తేలుతున్నారు . నలుగురు ఒక్క దగ్గర చేరి టిక్ టాక్ వీడియోలు చేసుకుంటున్నారు . ఇది చూసిన ప్రజలు ఆశ్చర్యానికి గురి అవుతున్నారు . ప్రస్తుతం వీరు చేసిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి .. ఇవి చూసిన నెటిజన్లు ప్రభుత్వ కార్యాలయంలో ఉంటూ ప్రజలకు పని చేయలిసింది పోయి మునిగి తేలడం ఏంటని ప్రశ్నిస్తున్నారు .