Khairatabad Ganesh 2022: ‎ప్రారంభమైన ఖైరతాబాద్‌ వినాయకుడి శోభాయాత్ర

Khairatabad Ganesh 2022: 50 అడుగుల భారీ మట్టి మహాగణపతిని ఊరేగింపుగా నిమజ్జనం చేయడం ఇదే తొలిసారి

Update: 2022-09-09 06:45 GMT

Khairatabad Ganesh 2022: ‎ప్రారంభమైన ఖైరతాబాద్‌ వినాయకుడి శోభాయాత్ర

Khairatabad Ganesh 2022: ఖైరతాబాద్‌ పంచముఖ మహాలక్ష్మీ గణపతి శోభాయాత్ర ప్రారంభమయ్యింది. ఈసారి 50 అడుగుల ఎత్తులో.. మట్టితో రూపుదిద్దుకున్న మహాగణపతి హుస్సేన్‌సాగర్‌లో నిమజ్జనానికి తరలి వెళుతున్నాడు. 50 అడుగుల భారీ మట్టి మహాగణపతిని ఊరేగింపుగా నిమజ్జనం చేయడం ఇదే తొలిసారి.

గతంతో పోలిస్తే ఈ సంవత్సరం ఖైరతాబాద్‌ మహాగణపతి బరువు రెట్టింపు అయ్యింది. పూర్తిగా మట్టితో తయారు చేయడంతో మహాగణపతి బరువు 60 నుంచి 70 టన్నులకు చేరింది. మహాగణపతిని సాగర తీరానికి ప్రత్యేక వాహనంపై తరలిస్తున్నారు.

ఖైరతాబాద్‌ మండపం నుంచి ప్రారంభమయ్యే మహాగణపతి శోభాయాత్ర సెన్షేషన్‌ థియేటర్‌ ముందు నుంచి రాజ్‌ దూత్‌ చౌరస్తా, టెలిఫోన్‌ భవన్, ఎక్బాల్‌ మినార్‌ చౌరస్తా, తెలుగుతల్లి చౌరస్తా నుంచి లుంబినీ పార్క్‌ నుంచి ఎన్టీఆర్‌ మార్గ్‌లో క్రేన్‌ నం– 4 వద్దకు చేరుకుంటుంది.

ఎన్టీఆర్‌ మార్గ్‌లో క్రేన్‌ నంబర్‌–4 వద్దకు మహాగణపతి చేరుకోగానే వెల్డింగ్‌లను తొలగిస్తారు. చివరి పూజల అనంతరం మధ్యాహ్నం సుమారు 3 గంటల కల్లా సాగర్‌లో మహా గణపతి నిమజ్జనం పూర్తవుతుందని పోలీసులు అంచనా.

Tags:    

Similar News