పంచాయతీరాజ్ శాఖపై మంత్రులు, అధికారులతో కేసీఆర్ సమీక్ష

Update: 2019-08-10 15:14 GMT

కొత్త పంచాయతీరాజ్‌ చట్టం వెలుగులో పంచాయతీరాజ్‌ వ్యవస్థను బలోపేతం చేయాలని ఆదేశించారు తెలంగాణ సీఎం కేసీఆర్..ప్రగతి భవన్ లో పంచాయతీరాజ్ శాఖపై మంత్రులు, అధికారులతో సమీక్ష నిర్వహించిన కేసీఆర్..గ్రామ పంచాయతీ నుంచి జిల్లా పరిషత్‌ వరకు ఎవరు ఏ విధులు నిర్వర్తించాలనే విషయంలో స్పష్టత ఇచ్చారు. జిల్లా పరిషత్‌లు, మండల పరిషత్‌లు ఏ పనిలేకుండా ఉత్సవ విగ్రహాలుగా ఉండబోవన్నారు. అధికార వికేంద్రీకరణ ద్వారా వారికి విధులు, నిధులు, బాధ్యతలు, అధికారాలు అప్పగిస్తామని చెప్పారు. గ్రామాల్లో 60 రోజుల కార్యాచరణ ప్రణాళిక అమలుకావడానికి ముందే స్థానిక సంస్థలకు అప్పగించే బాధ్యత విషయంలో స్పష్టత ఇస్తామన్నారు సీఎం కేసీఆర్.

Tags:    

Similar News