కాళేశ్వరం ప్రాజెక్ట్ ప్రారంభానికి ముహూర్తం ఖరారైంది. ఈనెల 21న కాళేశ్వరం ప్రాజెక్ట్ ప్రారంభం కానుంది. తెలంగాణ సీఎం కేసీఆర్.. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టును ప్రారంభించనున్నారు. కాళేశ్వరం ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా ఏపీ సీఎం జగన్ హాజరుకానున్నారు. ఈమేరకు కేసీఆర్ స్వయంగా విజయవాడ వెళ్లి జగన్ను ఆహ్వానించనున్నారు.