MLC Kavitha: రాష్ట్రానికి దార్శనిక నాయకుడు కేసీఆర్

MLC Kavitha: సీఎం కేసీఆర్‌ను పొగుడుతూ కవిత ట్వీట్

Update: 2023-05-04 07:40 GMT

MLC Kavitha: రాష్ట్రానికి దార్శనిక నాయకుడు కేసీఆర్

MLC Kavitha: తమ బీఆర్ఎస్ పార్టీ ఢిల్లీలో కార్యాలయాన్ని ప్రారంభించడం ప్రతి గులాబీ సైనికుడికి గర్వకారణమని ఎమ్మెల్సీ కవిత ట్వీట్ చేశారు. రాష్ట్రానికి దార్శనిక నాయకుడు కేసీఆర్, BRS పార్టీ నిబద్ధతతో చేసిన అద్భుతమైన ప్రయాణమని ఆమె కొనియాడారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఏకైక లక్ష్యంతో మొదలైన పార్టీ క్లిష్ట రాజకీయ పరిస్థితుల్లోనూ, తెలంగాణ ఆలోచనను నమ్మిన ప్రతి పౌరుడి అఖండ మద్దతుతో విజయం సాధించిందని ఎమ్మెల్సీ కవిత ట్వీట్ చేశారు.

తెలంగాణ రాష్ట్ర సాధన కోసం దేశవ్యాప్తంగా ఉన్న 39 రాజకీయ పార్టీలను ప్రోత్సహించిన నిబద్ధతతో ఒక లక్ష్యం ఉన్న వ్యక్తి కేసీఆర్ అని అన్నారామె. తెలంగాణ ఏర్పాటు, అభివృద్ధి కోసం కేసీఆర్‌కు ఉన్న రాజనీతిజ్ఞత, పట్టుదలే నేడు లోక్‌సభలో 9 మంది ఎంపీలు, రాజ్యసభలో ఏడుగురు ఎంపీలు, తెలంగాణలో 105 మంది ఎమ్మెల్యేలతో బీఆర్‌ఎస్‌తో పార్టీ జాతీయ శక్తి కేంద్రంగా ఎదిగిందన్నారు కవిత.



Tags:    

Similar News