ఆర్టికల్ 370 ని వ్యతిరేకించిన పార్టీలు సిగ్గుతో తలదించుకోవాలి : ఎంపీ బండి సంజయ్
ఆర్టికల్ 370ని రద్దు చేస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయంపట్ల దేశ ప్రజలంతా హర్షం వ్యక్తం చేస్తున్నారని అన్నారు బీజేపి నేత మరియు కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ .. ఒకే దేశం ఒకే రాజ్యమని శ్యాం ప్రసాద్ ముఖర్జీ కన్నా కలలను కేంద్రం నేరవేర్చినందుకు గాను సంతోషంగా ఉందని అయన అన్నారు . ఎన్నికల సందర్భంలోనే ఆర్టికల్ 370 రద్దుని బీజేపి తన మ్యానిఫెస్టోలో పెట్టిందన్న విషయాన్నీ గుర్తు చేసారు . కాశ్మీర్ భారత్ లో ఓ భాగమేనని అది ఎవరి జాగీరు కాదని అయన అన్నారు . దీనిని వ్యతిరేకించిన పార్టీలు సిగ్గుతో తలదించుకోవాలని అయన అన్నారు . శ్రావణమాసం సోమవారం కేంద్రం శుభవార్తను చెప్పడం నిజంగా సంతోషంగా ఉందని అయన చెప్పుకొచ్చారు .