జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో భారీ మెజార్టీతో గెలిపించిన నియోజకవర్గ ప్రజలకు కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ కృతజ్ఞతలు తెలిపారు. ప్రజల ఆశలను వమ్ము చేయనని, నియోజకవర్గ సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. అభివృద్ధే తన అజెండా అని పునరుద్ఘాటించారు. తనపై బీఆర్ఎస్, బీజేపీ నేతలు వ్యక్తిగతంగానూ విమర్శలు చేశారని, వారందరికీ ప్రజలకు తమ ఓటు ద్వారా బుద్ధి చెప్పారని అన్నారు.