జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ఫలితంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. ఓటమితో కుంగిపోమని..ప్రధాన ప్రతిపక్షంగా ప్రజల తరపున పోరాటం చేస్తామని చెప్పారు. పోలింగ్ ఆఖరి మూడు రోజుల్లో ఏం జరిగిందో అందరికీ తెలుసని అన్నారు.
జూబ్లీహిల్స్లో కాంగ్రెస్ దొంగ ఓట్లతో గెలిచిందని ఆరోపించారు. ఈ ఉప ఎన్నికతో ప్రత్యామ్నాయం బీఆర్ఎస్సేనని తెలిసిపోయిందన్నార కేటీఆర్. ఒక్క ఉపఎన్నికకే కాంగ్రెస్కు ముచ్చెమటలు పడ్డాయని...తెలంగాణలో కూడా ఫిరాయింపు ఎమ్మెల్యేల నియోజకవర్గల్లో ఉప ఎన్నికలు ఖాయమని కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు.