Jeevitha Rajasekhar: బీఆర్ఎస్ను గెలిపిస్తే కన్నీళ్లే మిగిలాయి
Jeevitha Rajasekhar: కేసీఆర్ కుటుంబమే బంగారం అయింది
Jeevitha Rajasekhar: బీఆర్ఎస్ను గెలిపిస్తే కన్నీళ్లే మిగిలాయి
Jeevitha: బీఆర్ఎస్ను గెలిపిస్తే కన్నీళ్లే మిగిలాయని బీజేపీ నాయకురాలు, సినీ నటి జీవిత రాజశేఖర్ అన్నారు. తెలంగాణ రాష్ట్రం బంగారు తెలంగాణ కాదు... కేసీఆర్ కుటుంబం మాత్రమే బంగారు కుటుంబంగా మారిందన్నారు. సిద్దిపేట లో జరుగుతున్న అరాచకాలు చూస్తుంటే సినిమా విలన్లు కూడా సరిపోరని ఆమె అన్నారు. సిద్దిపేట పట్టణంలోని పోచమ్మ ఆలయంలో జీవిత రాజశేఖర్ ప్రత్యేక పూజలు నిర్వహించి బీజేపీ జెండాను ఆవిష్కరించారు. పోచమ్మ గుడి వద్ద నిర్వహించిన కార్నర్ మీటింగ్లో జిల్లా అధ్యక్షుడు దూది శ్రీకాంత్రెడ్డితో కలిసి జీవిత రాజశేఖర్ పాల్గొన్నారు.