మరోసారి మెట్పల్లికి జమ్మూకశ్మీర్ పోలీసులు.. లింగన్నను అరెస్ట్ చేసి జమ్మూకు తరలింపు
ఆర్మీ రహస్యాలు చేరవేసిన వ్యక్తి ఖాతాకు నగదు బదిలీ చేసిన కేసులో జమ్మూకశ్మీర్ పోలీసులు నిన్న మెట్పల్లికి చేరుకున్నారు. మల్లాపూర్ మండలం కుస్థాపూర్కు చెందిన సరికెల లింగనన్నను అరెస్ట్ చేసి జమ్మూకు తరలించారు. జమ్మూకశ్మీర్ ఆర్మీ క్యాంప్లో కార్మికుడిగా పనిచేసే రాకేష్ అనే యువకుడు సైన్యం సమాచారాన్ని ఓ మహిళకు చేరవేస్తున్నాడన్న ఫిర్యాదుపై జనవరిలో రాకేష్పై కేసు నమోదయ్యింది. రాకేష్ ఖాతాకు వివిధ బ్యాంకుల నుంచి సొమ్ము వచ్చినట్లు జమ్మూ పోలీసులు విచారణలో గుర్తించారు. లింగన్న ఖాతా నుంచి కూడా పలుమార్లు రాకేష్ ఖాతాకు డబ్బులు పంపినట్లు గుర్తించారు.