ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి కీలక ప్రకటన చేశారు. సమ్మె విషయంలో రవాణామంత్రి పువ్వాడ అజయ్ సరిగ్గా స్పందించలేదని రేపటి లోగా సీఎం కేసీఆర్ను కార్మిక నేతలతో చర్చకు ఒప్పించాలని డిమాండ్ చేశారు. లేకపోతే సంగారెడ్డి డిపో పరిధిలోని 600 మంది కార్మికులతో రేపు హైదరాబాద్లో పువ్వాడ ఇంటిని ముట్టడిస్తామన్నారు జగ్గారెడ్డి. మంత్రి ఇంటిని ముట్టడించేందుకు ఆర్టీసీ కార్మికులు సిద్ధంగా ఉండాలని ఆయన పిలుపునిచ్చారు.