Krishna Sagararao: తొలివిడత రైతుభరోసా రూ.5,000 ప్రకటించడం విడ్డూరం
Krishna Sagararao: కాంగ్రెస్పై బీజేపీ ముఖ్య అధికార ప్రతినిధి కృష్ణసాగర్రావు విమర్శలు గుప్పించారు.
Krishna Sagararao: కాంగ్రెస్పై బీజేపీ ముఖ్య అధికార ప్రతినిధి కృష్ణసాగర్రావు విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన కొద్దిరోజుల్లోనే రైతులకు ఇచ్చిన హామీలను తుంగలొ తొక్కిందని ఆరోపించారు. వాయిదాల పద్దతిలో రైతు భరోసాను చెల్లించేందుకు సీఎం రేవంత్రెడ్డి ప్రయత్నిస్తామనడం విడ్డూరంగా ఉందన్నారు. కాంగ్రెస్ పార్టీ చేసిన వాగ్దానానికి భిన్నంగా సీఎం రేవంత్రెడ్డి తొలివిడతగా రైతుభరోసా 5,000 రూపాయలు ప్రకటించడం రైతులను మోసం చేయడమేనన్నారు కృష్ణసాగర్రావు. ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ ప్రజలకు నెరవేర్చలేని హామీలు ఇచ్చిందన్న ఆయన..రాబోయే కాలంలో కాంగ్రెస్ అసలు ముఖాన్ని ప్రజలు తిరస్కరిస్తారని ధీమా వ్యక్తం చేశారు.