తెలంగాణ రాజ్భవన్లో భారత రాజ్యాంగ 70వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో గవర్నర్ తమిళిసై సౌందర్రాజన్, ముఖ్యమంత్రి కేసీఆర్, హైకోర్టు చీఫ్ జస్టిస్ రాఘవేంద్ర సింగ్ చౌహాన్, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జడ్జిలతో పాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. గాంధీ, అంబేడ్కర్ చిత్రపటాలకు గవర్నర్ తమిళిసై, సీఎం కేసీఆర్ పూలమాల వేసి నివాళులర్పించారు.
దేశంలోని ప్రతీ పౌరుడికి మన రాజ్యాంగం రక్షణ కల్పిస్తోంది అని గవర్నర్ తమిళిసై చెప్పారు. రాజ్యాంగం కల్పించిన హక్కుల గురించి యువతకు తెలియదు. యువతను సరైన మార్గంలో నడిపించాలన్నదే ఈ కార్యక్రమం ఉద్దేశం అన్నారు. మనది డైనమిక్ రాజ్యాంగం అని, అనేక మార్పులు, చేర్పులకు లోనైందన్నారు సీఎం కేసీఆర్. మన రాజ్యాంగం 7 దశాబ్దలుగా పరిపుష్టంగా కొనసాగుతోది అని, రాజ్యాంగ స్ఫూర్తితో మన కర్తవ్యాన్ని నిర్వహించుకుందాం అన్నారు. భారత రాజ్యాంగ స్ఫూర్తికి ప్రతి ఒక్కరూ పునరంకితం కావాలి అని కేసీఆర్ పిలుపునిచ్చారు.