తెలంగాణలో హ్యుందయ్ కంపెనీ భారీ పెట్టుబడులు

Hyundai Company: తెలంగాణ రాష్ట్రాన్ని మరో భారీ ప్రాజెక్టు వరించింది.

Update: 2022-05-26 13:00 GMT

తెలంగాణలో హ్యుందయ్ కంపెనీ భారీ పెట్టుబడులు

Hyundai Company: తెలంగాణ రాష్ట్రాన్ని మరో భారీ ప్రాజెక్టు వరించింది. 1400 కోట్ల భారీ పెట్టుబడి పెట్టనున్నట్టు దావోస్‎లో జరుగుతున్న వాల్డ్ ఎకనామిక్ ఫోరమ్ లో హ్యుందయ్ కంపెనీ ప్రకటించింది. మంత్రి కేటీఆర్‎తో సమావేశమైన హ్యుందయ్ గ్రూప్ సీఐఓ యంగ్చో చి ఈ విషయం ప్రకటించారు. తెలంగాణలోని మొబిలిటీ క్లస్టర్లో ఈ పెట్టుబడి పెడతామని చెప్పారు. కేవలం పెట్టుబడి మాత్రమే కాక రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న తెలంగాణ మొబిలిటీ వ్యాలీలో భాగస్వామిగా ఉండేందుకు సంస్థ అంగీకరించడం మరో విశేషం. రాష్ట్రంలో భాగస్వామిగా ఉండేందుకు ముందుకొచ్చినందుకు హ్యుందయ్ కంపెనీ యాజమాన్యానికి కేటీఆర్ ధన్యవాదాలు తెలిపారు. దీంతో రాష్ట్రంలోకి మరిన్ని పెట్టుబడులు వస్తాయని కేటీఆర్ ఆశాభావం వ్యక్తం చేశారు.

Tags:    

Similar News