మెట్రో రైల్ ప్రయాణికులకు దసరా ధమాకా

Update: 2020-10-16 13:32 GMT

హైదరాబాద్ మెట్రో రైల్ ప్రయాణీకులకు ఎల్ అండ్ టీ మెట్రో దసరా ధమాకా ప్రకటించింది. రేపటినుంచి మెట్రో ట్రావెలర్స్ కు టిక్కెట్ ధరల్లో భారీ డిస్కౌంట్ కల్పించింది. రేపటినుంచి ప్రయాణించే వారికి ఈనెల31 వరకూ టిక్కెట్ ధరల్లో 40 శాతం తగ్గింపు వర్తిస్తుంది. అలాగే స్మార్ట్ కార్డ్ ద్వారా జర్నీ చేస్తే 50 శాతం తగ్గింపు లభిస్తుంది. అలాగే 400 రూపాయలు రీచార్జ్ చేసుకుంటే 800 బాలెన్స్ లభిస్తుంది. ఇవేకాదు మరికొన్ని ఆఫర్లు కూడా మెట్రో అధికారులు ప్రకటించారు. బతుకమ్మ పండుగతో మొదలుకొని సంక్రాంతి పండగ వరకూ ఈరాయితీలు వర్తిస్తాయి.

Tags:    

Similar News