అంతర్రాష్ట్ర బస్సు సర్వీసులపై కొలిక్కిరాని చర్చలు.. ఇవాళ మరోసారి తెలుగు రాష్ట్రాల అధికారుల సమావేశం

Update: 2020-10-21 06:21 GMT

తెలుగు రాష్ట్రాల మధ్య అంతర్రాష్ట్ర బస్సు సర్వీసుల ఒప్పందంపై ఇప్పటికీ చర్చలు కొలిక్కిరాలేదు. ఇప్పటికే పలుమార్లు చర్చలు జరిపినా ఫలితం లేకపోగా పండగ నేపథ్యంలో మరోసారి సమావేశమవుతున్నారు ఇరు రాష్ట్రాల అధికారులు. అయితే చర్చలు తుదిదశకు చేరుకున్నట్లు తెలుస్తోంది. తాత్కాలికంగా లేక శాశ్వతంగా బస్సులు నడిపేందుకు ఇవాళ్టి సమావేశంలో ఒప్పందం కుదిరే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంతా ఓకే అయితే రెండు రాష్ట్రాల మధ్య రేపటి నుంచి బస్సులు నడిపేందుకు అధికారులు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. 

Tags:    

Similar News