హుజూర్నగర్ ఉప ఎన్నిక అభ్యర్థిని అధికార టీఆర్ఎస్ ప్రకటించింది. గత ఎన్నికల్లో ఉత్తమ్ చేతిలో స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయిన శానంపూడి సైదిరెడ్డి పేరునే పార్టీ అధినేత కేసీఆర్ ఖరారు చేశారు. హుజూర్నగర్లో ఉప ఎన్నికను వచ్చే నెల 21 నిర్వహిస్తామని కేంద్ర ఎన్నికల కమిషన్ ప్రకటించింది. ఈ నేపథ్యంలో జిల్లాకు చెందిన మంత్రి జగదీష్రెడ్డి, ఇతర ముఖ్య నాయకులతో మాట్లాడిన తెలంగాణ సీఎం కేసీఆర్ మరోసారి సైదిరెడ్డిపైనే నమ్మకం ఉంచారు. అతనికే మరోసారి అవకాశం ఇచ్చారు.