నిజామాబాద్ పోలీస్ కమిషనర్ కార్తికేయ కు మానవ హక్కుల కమిషన్ నోటీసులు జారీ చేసింది. కమ్మర్ పల్లి మండలం కొనాపూర్ సర్పంచ్ కుల బహిష్కరణ పై ఆగస్టు 14 లోపు నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. నిజామాబాద్ జిల్లాలోని కొనాపూర్ గ్రామ సర్పంచ్ అయిన తనపై కొందరు గ్రామస్థులు కక్షపూరితంగా వ్యవహరించి కుల బహిష్కరణ చేశారని ఆరోపిస్తూ హెచ్చార్సీలో ఓ పిటిషన్ దాఖలైంది. రెండేళ్లుగా తమ కుటుంబానికి నీటి సరఫరాను బంద్ చేశారని, తమతో మాట్లాడినవారికి 10 వేల జరిమానా విధిస్తున్నారని ఆ సర్పంచ్ ఆవేదన వ్యక్తం చేశారు.