యాదాద్రి ఆలయంలో భక్తుల రద్దీ.. 2 గంటల సమయం

Yadadri: స్వామి వారి దర్శనానికి బారులు తీరిన భక్తులు

Update: 2024-03-31 09:38 GMT

యాదాద్రి ఆలయంలో భక్తుల రద్దీ.. 2 గంటల సమయం

Yadadri: యాదాద్రి శ్రీలక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో భక్తుల రద్దీ భారీగా పెరిగింది. ఆదివారం కావడంతో ఉదయం నుండే భక్తులు స్వామి వారి దర్శనానికి భారీగా తరలివచ్చారు. దర్శనానికి క్యూలైన్ లలో భక్తులు బారులు తీరారు. స్వామి వారి ఉచిత దర్శనానికి 2 గంటలు, ప్రత్యేక దర్శనానికి గంట సమయం పడుతుంది. రద్దీ వలన ప్రసాద విక్రయ శాల, సత్యనారాయణ వ్రత మండపంలో భక్తుల సందడి నెలకొంది. భక్తుల రద్దీ దృష్ట్యా దేవస్థానం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది.

Tags:    

Similar News