యాదాద్రిలో భక్తుల రద్దీ.. స్వామి వారి ధర్మదర్శనానికి 2 గంటలు

Yadadri: రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలను నుంచి భక్తుల రాక

Update: 2024-01-28 09:53 GMT

యాదాద్రిలో భక్తుల రద్దీ.. స్వామి వారి ధర్మదర్శనానికి 2 గంటలు

Yadadri: వరుస సెలవులు నేపథ్యంలో సుప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన యాదాద్రి శ్రీలక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో భక్తుల రద్దీ పెరిగింది.. వేకువ జామునే స్వామి వారి దర్శనానికి రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పోటెత్తారు. ఆలయానికి భక్తుల రద్దీ పెరగడంతో స్వామి వారి ధర్మదర్శనానికి 2 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి గంట సమయం పడుతోంది. క్షేత్ర పరిసరాల్లో భక్తుల సందడి కనిపిస్తోంది.

దర్శన క్యూలైన్లు, ఆలయ మాఢ వీధులు, కళ్యాణ కట్ట, పుష్కరిణి, కొండపై బస్టాండ్, వ్రత మండపం, ఘాట్ రోడ్డు భక్తులతో కిటకిటలాడుతున్నాయి.. ఆలయంలో స్వామి వారి నిత్య కళ్యాణ పర్వంలో సువర్ణ పుష్పార్చన, వేద ఆశీర్వచనం నిర్వహించారు అర్చకులు.. భక్తులు మొక్కులు చెల్లించుకుంటున్నారు..

Tags:    

Similar News