Telangana: హోంమంత్రి చేతుల మీదుగా ఇండియన్ పోలీస్ మెడల్

గతంలో కేంద్ర ప్రభుత్వంచే ఇండియన్ పోలీస్ మెడల్ కు ఎంపిక చేయబడ్డ పోలీస్ అధికారులు హైదరాబాదు లోని రవీంద్రభారతి కళా క్షేత్రం లో కార్యక్రమములో పోలీస్ అధికారులకు రాష్ట్ర హోం శాఖ మంత్రి మహమూద్ అలీ అందజేసారు.

Update: 2020-01-09 06:23 GMT

వరంగల్: గతంలో కేంద్ర ప్రభుత్వంచే ఇండియన్ పోలీస్ మెడల్ కు ఎంపిక చేయబడ్డ పోలీస్ అధికారులు హైదరాబాదు లోని రవీంద్రభారతి కళా క్షేత్రం లో కార్యక్రమములో పోలీస్ అధికారులకు రాష్ట్ర హోం శాఖ మంత్రి మహమూద్ అలీ అందజేసారు. ఇండియన్ పోలీస్ మెడల్ అందుకున్నవారిలో అర్మూడ్ రిజర్వ్ విభాగం అదనపు ఎస్పీలు భీం రావు, గిరిరాజుతో పాటు స్పెషల్ బ్రాంచ్ ఎస్.ఐ మక్బూల్ పాషా వున్నారు.

అదే విధంగా హన్మకొండ ఎ.సి.పి జితేందర్ రెడ్డి మహోన్నత సేవాపతకాన్ని అందుకున్నారు. హోం మంత్రి చేతుల మీదుగా ఉత్తమ సేవాపతకాన్ని అందుకున్న పర్వతగిరి ఇన్స్ స్పెక్టర్ కిషన్, హోం మంత్రి చేతుల మీదుగా పోలీస్ ఫర్ గ్యాలంటరీ పతకాన్ని అందుకున్న నర్సంపేట్ ఏ.సి.పి సి.హెచ్ .ఆర్ వి ఫణీందర్ ఈ సందర్బంగా పతకం అందుకున్న అధికారులకు పోలీస్ కమిషనర్ డా. వి. రవీందర్ అభినందనలు తెలియజేసారు.

Tags:    

Similar News