నిందితుల మృతదేహాలను గాంధీకి తరలించండి : హైకోర్టు

Update: 2019-12-09 10:12 GMT
హైకోర్టు

దిశ నిందితుల ఎన్ కౌంటర్ పై విచారణ గురువారానికి వాయిదా పడింది. ఎన్ కౌంటర్ విచారణకు ప్రత్యేక న్యాయవాదిని నియమించినట్టు హైకోర్టు తెలిపింది. ప్రత్యేక న్యాయవాదిగా సీనియర్ లాయర్ ప్రకాష్ రెడ్డిని నియమించినట్టు కోర్టు తెలిపింది. నిందితుల మృతదేహాలను గాంధీ ఆస్పత్రికి తరలించి శుక్రవారం వరకు గాంధీలోనే మృతదేహాలను భద్రపరచాలని హైకోర్టు ఆదేశించింది. ఈ కేసుకు సంబంధించి బుధవారం సుప్రీం కోర్టులో విచారణ జరుగుతున్న నేపథ్యంలో హైకోర్టు గురువారానికి వాయిదా వేసింది. ఇక తాజాగా హైకోర్టు ఇచ్చిన ఆదేశంతో నిందితుల మృతదేహాలను మహబూబ్ నగర్ ఆసుపత్రి నుంచి గాంధీ ఆసుపత్రికి తరలించనున్నారు. 

Tags:    

Similar News