మిమ్మల్ని చూసి గర్వపడుతున్నా సార్: హీరో రాజశేఖర్ ట్వీట్

Update: 2020-04-20 09:49 GMT

కరోనా కట్టడికి తెలంగాణ ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే, ప్రజల ఆరోగ్యం కంటే ఏది ఎక్కువ కాదని లాక్ డౌన్ ని మే 07వరకు పొడిగిస్తూ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రముఖ సీనియర్ హీరో రాజశేఖర్ ట్వీట్ చేశారు.

సీఎం కేసీఆర్ గారు మీడియా సమావేశంలో ప్రతి ఒక్క సమస్యను పరిష్కరించారు. కొన్ని గొప్ప నిర్ణయాలు తీసుకున్నారు. ఇప్పుడు మనమంతా ప్రభుత్వ నిబంధనలు పాటించాలి. సీఎంపై నాకు చాలా నమ్మకం ఉంది.ఈ మహమ్మారి నుంచి తెలంగాణ ప్రభుత్వం మనందరినీ సాధ్యమైన ఉత్తమ మార్గంలో బయటకు తీసుకొస్తుంది. మిమ్మల్ని చూసి గర్వపడుతున్నా సార్' అని రాజశేఖర్ ట్వీట్ చేశారు. దీన్ని తెలంగాణ సీఎంఓ, మంత్రి కేటీఆర్ కు ట్యాగ్ చేశారు.


Tags:    

Similar News