Harish Rao: దేశంలో అత్యధికంగా వేతనం తీసుకుంటున్న ఆశా వర్కర్లు తెలంగాణలోనే

Harish Rao: ఆశా వర్కర్ల మొబైల్‌ బిల్లులను ప్రభుత్వమే భరిస్తుంది

Update: 2023-07-07 08:48 GMT

Harish Rao: దేశంలో అత్యధికంగా వేతనం తీసుకుంటున్న ఆశా వర్కర్లు తెలంగాణలోనే

Harish Rao: హైదరాబాద్‌ శిల్పకళావేదికలో కొత్తగా ఎంపికైన 15 వేల మంది ఆశావర్కర్లకు మంత్రి హరీశ్‌ రావు నియామక పత్రాలు అందేశారు. దేశంలో అత్యధికంగా వేతనం తీసుకుంటున్న ఆశా వర్కర్లు తెలంగాణలోనే ఉన్నారని మంత్రి హరీశ్‌ రావు అన్నారు. ఆశా వర్కర్ల మొబైల్‌ బిల్లులను ప్రభుత్వమే భరిస్తుందని చెప్పారు. బస్తీ దవాఖానలతో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందుతున్నాయని మంత్రి హరీశ్‌ రావు అన్నారు.

ఒకప్పుడు ఏ రోగం వచ్చినా గాంధీ, ఉస్మానియా దవాఖానలకు వెళ్లేవాళ్లమని.. స్వరాష్ట్రంలో ఇప్పుడు ఆ పరిస్థితి లేదన్నారు. సీఎం కేసీఆర్‌ హైదరాబాద్‌లో 350 బస్తీ దవాఖానలు ఏర్పాటు చేశారని వెల్లడించారు. దీంతో ఉస్మానియా, గాంధీ హాస్పిటళ్లలో ఓపీ శాతం తగ్గిందని చెప్పారు.

Tags:    

Similar News