Harish Rao: కేసీఆర్ పదేళ్ల పాలనలో కరువు లేదు, కర్ఫ్యూలు లేవు
Harish Rao: తెలంగాణలో ప్రతిపక్షాలకు ఎజెండా లేదు
Harish Rao: కేసీఆర్ పదేళ్ల పాలనలో కరువు లేదు, కర్ఫ్యూలు లేవు
Harish Rao: రైతుబంధు, ధరణి, కరెంట్ ఎందుకంటున్న కాంగ్రెస్ నాయకులను బంగాళాఖాతంలో కలపాలని మంత్రి హరీష్ రావు పిలుపునిచ్చారు. నర్సాపూర్ బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొన్న ఆయన కాంగ్రెస్ పార్టీ నిప్పులు చెరిగారు. నేడు స్విచ్ వేస్తే వచ్చే కరెంట్ ఉండంగా.. కటిక చీకట్ల కర్ణాటక మోడల్ను తీసుకొస్తామని కాంగ్రెస్ చెబుతున్నాయని హరీష్ రావు ఆరోపించారు. తెలంగాణలో ప్రతిపక్షాలకు ఎజెండా లేదని, అందుకే బూతులు మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు. కేసీఆర్ పదేళ్ల పాలనలో కరువు లేదు, కర్ఫ్యూలు లేవన్నారు హరీష్ రావు.