యురేనియం తవ్వకాలపై మంత్రి కేటీఆర్ శాసనమండలిలో ఇచ్చిన స్పష్టత తమకు మరింత ధైర్యం ఇచ్చిందన్నారు ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజు. మంత్రి ఇచ్చిన సమాధానంతో నైనా కాంగ్రెస్ నాయకులు కళ్లు తెరిచి అసత్య ప్రచారాలు మానుకోవాలని సూచించారు. అవసరమైతే నల్లమలపై సభలో ముఖ్యమంత్రి చే వివరణ ఇచ్చే విధంగా చూస్తామన్నారు.