Hyderabad: హైదరాబాద్‌ శివారులో కాల్పుల కలకలం

Hyderabad: పంద్రాగస్టు రోజున హైదరాబాద్‌ శివారులో కాల్పులు కలకలం రేపాయి.

Update: 2022-08-15 14:30 GMT

Hyderabad: హైదరాబాద్‌ శివారులో కాల్పుల కలకలం

Hyderabad: పంద్రాగస్టు రోజున హైదరాబాద్‌ శివారులో కాల్పులు కలకలం రేపాయి. రాచకొండ మిర్ఖంపేట్‌ గెస్ట్‌హౌస్‌లో విఘ్నేశ్వర్‌రెడ్డి, విక్రమ్‌ అనే ఇద్దరు వ్యక్తులు గన్‌తో గాల్లోకి కాల్పులు జరిపారు. ఈ ఫైరింగ్‌ దృశ్యాలను వీడియో తీసుకొని, వాట్సాప్‌ స్టేటస్‌లో పెట్టుకున్నారు. పుట్టినరోజు వేడుకల సందర్భంగా కాల్పులు జరిపినట్టు తెలుస్తోంది. నిందితులు వాడిన ఎయిర్‌గన్‌ నిజమైనదా?.. కాదా అని తెలియాల్సి ఉంది. ఈ వేడుకలకు బడా నాయకులు కూడా హాజరైనట్లు సమాచారం. ఘటనపై యాచారం పోలీసులు విచారణ జరుపుతున్నారు.

Tags:    

Similar News