కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలం గుజ్జులపల్లిలో తుపాకీ కలకలం సృష్టించింది. కారుకు సైడ్ ఇవ్వలేదని ద్విచక్రదారుడి ఇంటికి వెళ్లి... తుపాకీతో బెదిరించాడు. దీంతో గ్రామస్తులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. నిందితుడు రాజేష్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కారు, తుపాకీ స్వాధీనం చేసుకున్నారు. అయితే తుపాకీ డమ్మీదని పోలీసులు గుర్తించారు.