Telangana: ఉదయం 11గంటలకు జలసౌధలో KRMB, GRMB అత్యవసర భేటి

Telangana: సమావేశానికి హాజరు కావాలని తెలుగు రాష్ట్రాలకు బోర్డులు లేఖలు * హాజరుకాలేమని తేల్చి చెప్పిన తెలంగాణ ప్రభుత్వం

Update: 2021-08-09 04:41 GMT
జల సౌధలో కృష్ణ, గోదావరి నది యాజమాన్య బోర్డు మీటింగ్ 

Telangana: ఇవాళ ఉదయం 11 గంటలకు జలసౌధలో కృష్ణా, గోదావరి రివర్ యాజమాన్య బోర్డుల అత్యవసర సమావేశం జరగనుంది. సమావేశానికి హాజరు కావాలని ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలకు బోర్డులు ఇప్పటికే లేఖలు రాశాయి. అయితే సుప్రీంకోర్టు, ఎన్జీటీలో విచారణ ఉన్న నేపథ్యంలో హాజరు కాలేమని తెలంగాణ ప్రభుత్వం ఇరు బోర్డులకు లేఖలు రాసింది. బోర్డులు మాత్రం సమావేశానికి యధావిధిగా కొనసాగించనుంది.

Tags:    

Similar News