రేపు భద్రాచలంలో గవర్నర్‌ తమిళిసై పర్యటన

*ఇవాళ రాత్రి ట్రైన్‌లో భద్రాచలం బయలుదేరనున్న తమిళిసై

Update: 2022-07-16 06:02 GMT

రేపు భద్రాచలంలో గవర్నర్‌ తమిళిసై పర్యటన

Tamilisai: గవర్నర్ తమిళిసై రేపు భద్రాచలంలో పర్యటించనున్నారు. వరద ముంపు ప్రాంతాలను గవర్నర్ పరిశీలించనున్నారు. ఇవాళ రాత్రి సికింద్రాబాద్‌ నుంచి ట్రైన్‌లో గవర్నర్ భద్రాచలం బయలుదేరనున్నారు. గవర్నర్ భద్రాచలం టూర్‌కు సంబంధించి అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తిచేస్తున్నారు.

ఇదిలా ఉండగా రేపు సీఎం కేసీఆర్‌ ఏరియల్‌ సర్వే నిర్వహించనున్నారు. కడెం నుంచి భద్రాచలం వరకు ఉన్న గోదావరి పరివాహక ప్రాంతాల్లో ఈ ఏరియల్ సర్వే కొనసాగనుంది. వరద సహాయక చర్యలను సీఎం పర్యవేక్షించనున్నారు. సీఎం చేపట్టే ఏరియల్‌ సర్వకు సంబంధించిన హెలికాప్టర్ రూట్ సహా తదితర విధివిధినాలను అధికార యంత్రాంగం పర్యవేక్షిస్తుంది. 

Full View


Tags:    

Similar News