శంషాబాద్ ఎయిర్ పోర్టులో భారీగా బంగారం పట్టివేత

Update: 2019-10-05 11:07 GMT

హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్ పోర్ట్‌లో మరోసారి భారీగా బంగారం పట్టుబడింది. దుబాయ్ నుంచి వచ్చిన ప్రయాణికుడి నుంచి ఏకంగా 5 కిలోల బంగారం బిస్కెట్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడ్డ బంగారం విలువ రెండు కోట్ల రూపాయలు ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ముగ్గురు ప్రయాణికులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. 

Tags:    

Similar News