హైదరాబాద్లో విషాదం.. బాచుపల్లిలో గోడకూలి ఏడుగురి మృతి
Hyderabad: భారీ వర్షాలకు కుప్పకూలిన నిర్మాణంలో ఉన్న గోడ
Hyderabad: హైదరాబాద్ బాచుపల్లిలో ఘోర విషాదం చోటు చేసుకుంది. రేణుక ఎల్లమ్మకాలనీలో భారీ వర్షాలకు నిర్మాణంలో ఉన్న అపార్ట్మెంట్ గోడ కూలి ఏడుగురు కార్మికులు మృతి చెందారు. మృతుల్లో నలుగురు ఒడిశా వాసులు, ముగ్గురు ఛత్తీస్గఢ్ వాసులుగా గుర్తించారు. మృతుల్లో ఓ నాలుగేళ్ల చిన్నారి ఉన్నట్లు గుర్తించారు. మృతులు ఒడిశాకు చెందిన తిరుపతి, శంకర్, రాజు, ఖుషి.. ఛత్తీస్గఢ్కు చెందిన రామ్ యాదవ్, గీతా, నాలుగేళ్ల చిన్నారి హిమాన్షుగా గుర్తించారు.
నిర్మాణంలో ఉన్న రిటన్నింగ్ వాల్ అక్కడ పని చేస్తున్నవారిపై పడడంతో ఈ ఘటన జరిగినట్లు పోలీసులు గుర్తించారు. సమాచారం తెలుసుకున్న జీహెచ్ఎంసీ, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది జాయింట్ ఆపరేషన్ చేపట్టి డెడ్బాడీలను జేసీబీల సాయంతో బయటికి తీశారు. ఘటనకు సంబంధించి బిల్డర్, సెంట్రింగ్ కూలీల కాంట్రాక్టర్పై కేసు నమోదు చేశారు పోలీసులు.