Modi: వేములవాడలో బీజేపీ బహిరంగ సభలో పాల్గొననున్న మోడీ
Modi: బండి సంజయ్కు మద్దతుగా ప్రధాని మోడీ ఎన్నికల ప్రచారం
Modi: లోక్సభ ఎన్నికల పోలింగ్కు మరో ఐదు రోజులు మాత్రమే సమయం ఉండడంతో ప్రచారాలను స్పీడప్ చేసింది బీజేపీ. ఇందులో భాగంగానే రాష్ట్రాలను చుట్టేస్తున్నారు ప్రధాని మోడీ. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన తెలంగాణలో పర్యటిస్తున్నారు. దక్షిణకాశీగా అభివృద్ధి చెందిన వేములవాడ రాజరాజేశ్వరస్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. కాసేపట్లో వేములవాడలో కరీంనగర్ బీజేపీ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్కు మద్దతుగా జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు. అనంతరం వరంగల్ జిల్లా పర్యటనకు వెళ్తారు మోడీ. మామునూరు సమీపంలోని లక్మీపురంలో జరిగే బీజేపీ బహిరంగ సభకు ఆయన హాజరవుతారు. వరంగల్ ఎంపీ అభ్యర్థి ఆరూరి రమేష్కు మద్దతుగా ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు.
ఇక మోడీ పర్యటన ముగిసిన తర్వాత రోజే కేంద్రహోంమంత్రి అమిత్ షా రాష్ట్రంలో పర్యటించనున్నారు. ఇవాళ రాత్రికి హైదరాబాద్ చేరుకుని ఇక్కడే బస చేస్తారు. రేపు ఉదయం 9 గంటలకు భువనగిరిలో బూర నర్సయ్య గౌడ్కు మద్దతుగా జరిగే సభలో పాల్గొని ప్రసంగిస్తారు అమిత్ షా.