Rabid Dog Attack in Nelakondapalli : నేలకొండపల్లిలో పిచ్చికుక్క దాడి.. ఐదుగురికి గాయాలు
Rabid Dog Attack in Nelakondapalli : ఖమ్మం జిల్లా నేలకొండపల్లిలో పిచ్చికుక్క ఐదుగురిని కరిచింది. చిన్నారులు సహా బాధితులకు ఆస్పత్రిలో చికిత్స అందించారు. గ్రామంలో భయాందోళనలు నెలకొన్నాయి.
Rabid Dog Attack in Nelakondapalli : నేలకొండపల్లిలో పిచ్చికుక్క దాడి.. ఐదుగురికి గాయాలు
ఖమ్మం జిల్లా: ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం ముజ్జుగూడెంలో పిచ్చికుక్క స్వైరవిహారం చేసింది. ఒకే కుక్క ఐదుగురిపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచింది. కుక్కకాటుకు గురైన వారిలో చిన్నారులు కూడా ఉన్నారు.
దాడి జరిగిన వెంటనే స్థానికులు బాధితులను నేలకొండపల్లి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వైద్యులు వారికి ప్రాథమిక చికిత్స అందించి అవసరమైన యాంటీ రేబిస్ వ్యాక్సిన్ ఇచ్చారు. గాయపడిన వారి పరిస్థితి స్థిరంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.
ఈ ఘటనతో ముజ్జుగూడెం గ్రామంలో భయాందోళనలు నెలకొన్నాయి. గ్రామస్తులు కుక్కల సంచారం పెరిగిందని, పలుమార్లు అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ సరైన చర్యలు తీసుకోవడం లేదని ఆరోపిస్తున్నారు. చిన్నారులు బయటకు వెళ్లేందుకు కూడా భయపడుతున్న పరిస్థితి ఉందని స్థానికులు పేర్కొన్నారు.
పిచ్చికుక్కను పట్టుకునేందుకు సంబంధిత శాఖలు చర్యలు చేపట్టాలని గ్రామస్తులు కోరుతున్నారు. అధికారులు స్పందించి కుక్కల నియంత్రణపై తక్షణ చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.