తెలంగాణ విద్యుత్ రంగంలో భారీ కుంభ కోణం జరిగిందని కొందరు అసత్య ప్రచారం చేస్తున్నారని ట్రాన్స్కో, జెన్కో సీఎండీ ప్రభాకర్ రావు అన్నారు. అన్ని విద్యుత్ కొనుగోలు ఒప్పందాలన్ని పారదర్శకంగా , అవినీతికి తావు లేకుండా జరిగాయని స్పష్టం చేశారు. కొందరు విద్యుత్ సంస్థలపై నిరాధార ఆరోపణలు చేస్తున్నారని తెలిపారు. వారు కోరుకుంటే విద్యుత్ సంస్థపై సీబీఐ విచారణ, సిట్టింగ్ జడ్జితో విచారణకు సిద్ధమని ప్రభాకర్ రావు సవాల్ విసిరారు.