గాలి జనార్థన్ ఈడీ కార్యాలయంలో విచారణకు హాజరయ్యారు. గతంలో సీబీఐ నమోదు చేసిన కేసులలో భాగంగా ఈడీ తన ఆస్తులను జప్తు చేసిందని, వాటిని తిరిగి ఇవ్వాల్సిందిగా ఈడీని కోరామని తెలిపారు. ఓబులాపురం మైనింగ్ కేసులను కర్ణాటక హైకోర్టు కొట్టివేసిందని, అందుకే ఈడీ జప్తు చేసిన రూ. వెయ్యి కోట్లు తిరిగివ్వాలని కోరామన్నారు. అయితే ఈడీ ఆస్తులు ఇవ్వకపోతే సుప్రీం కోర్టుకు వెళ్తామని చెప్పారు గాలి జనార్థన్.