కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్షాను మాజీ ఎంపీ వివేక్ మంగళవారం ఢిల్లీలో కలిశారు. తెలంగాణ సచివాలయ కూల్చివేతపై హోంమంత్రికి వివేక్ ఫిర్యాదు చేశారు. తెలంగాణ ప్రభుత్వం ప్రజాధనం వృధా చేస్తోందంటూ వినతి పత్రం ఇచ్చారు. వివేక్ బీజేపీలో చేరుతారంటూ గత కొద్ది కాలంగా ఊహాగానాలు వస్తున్నాయి. దీనిలో భాగంగానే ఆయన అమిత్ షాను కలిశారని, వచ్చే నెలలో ఆయన బీజేపీలో చేరే అవకాశం ఉన్నట్లు సమాచారం.