కేసీఆర్ సమక్షంలో టీఆర్ఎస్‌లో చేరిన బీజేపీ నేత పెద్దిరెడ్డి

E Peddi Reddy: మాజీ మంత్రి ఇనుగాల పెద్దిరెడ్డి టీఆర్ఎస్ లో చేరారు.

Update: 2021-07-30 13:23 GMT

కేసీఆర్ సమక్షంలో టీఆర్ఎస్‌లో చేరిన బీజేపీ నేత పెద్దిరెడ్డి

E Peddi Reddy: మాజీ మంత్రి ఇనుగాల పెద్దిరెడ్డి టీఆర్ఎస్ లో చేరారు. సీఎం కేసీఆర్ సమక్షంలో గులాబీ తీర్ధం పుచ్చుకున్నారు. పెద్దిరెడ్డికి గులాబీ కండువ కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమానికి మంత్రులు హరీష్‌రావు, కొప్పుల, గంగుల, ఎల్.రమణ, బాల్కా సుమన్ హాజరైర్యారు. పెద్దిరెడ్డి తనకు సన్నిహితుడని కేసీఆర్ చెప్పారు. సమాజం పట్ల మంచి అవగాహన ఉందని, తెలంగాణ అభివృద్ధిలో పెద్దిరెడ్డి ఇక నుంచి భాగస్వామ్యం కావడం సంతోషంగా ఉందన్నారు సీఎం కేసీఆర్.

చేనేత కార్మికులకు రైతుబీమా తరహా సహాయం అందిస్తామని, వ్యవసాయ శాఖలో పక్కాగా రైతుబంధు అమలవుతోందని కేసీఆర్ తెలిపారు. ఎస్సీ సంక్షేమ శాఖలోనూ రైతు బీమా తరహా ఏర్పాట్లు చేయాలని, తెలంగాణ వచ్చిన తొలినాళ్లలో చాలా ఇబ్బందులు ఉండేవి అని సీఎం కేసీఆర్ అన్నారు. 

Tags:    

Similar News