Fire in Train: ప్యాసింజర్‌ రైల్లో చెలరేగిన మంటలు.. పూర్తిగా దగ్ధమైన లగేజ్‌ బోగీ

Fire in Train: ప్రమాద కారణాలపై రైల్వే అధికారుల దర్యాప్తు

Update: 2023-12-26 13:58 GMT

Fire in Train: ప్యాసింజర్‌ రైల్లో చెలరేగిన మంటలు.. పూర్తిగా దగ్ధమైన లగేజ్‌ బోగీ

Fire in Train: మహారాష్ట్రలోని నాందేడ్‌ రైల్వే స్టేషన్‌లోని నిలిచి ఉన్న ప్యాసింజర్ రైలులో అగ్ని ప్రమాదం సంబవించింది. అందరూ చూస్తుండగానే.. ఎగిసి పడుతున్న అగ్ని కీలలకు కొన్ని భోగీలు కాలిపోయాయి. స్టేషన్ సిబ్బంది ద్వారా సమాచారం అందుకున్న రైల్వే అధికారులు, రెస్క్యూ టీమ్‌ హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్నాయి. మంటలు ఇతర భోగీలకు వ్యాపించకుండా ఫైర్ ఇంజిన్ల సహాయంతో మంటలను అరగంటలో ఆర్పివేశారు.

అయితే అప్పటికే బోగీల్లోని పర్నీచర్‌ మొత్తం కాలిపోయింది. అయితే మంటలు మొదట లగేజీ కమ్‌ గార్డ్‌ వ్యాన్‌ కోచ్‌లో సంభవించినట్టు తెలుస్తోంది. అయితే అగ్ని ప్రమాదానికి కారణాలు మాత్రం తెలియరాలేదు. మంటల సమయంలో భోగీల్లో ఎవరైనా ఉన్నారా? అన్నది అంశంపైనా సమాచారం లేదు. ప్రమాదంపై విచారణ జరుపుతున్నట్టు నాందేడ్‌ రైల్వే స్టేషన్‌ అధికారులు వెల్లడించారు.


Tags:    

Similar News