కుమ్రంబీమ్ భీం జిల్లా బెజ్జురు మండలం తహసీల్దార్ కార్యాలయంలో తండ్రి కోడుకుల ఆత్మహత్య యత్నం చేశారు. వారసత్వ భూమి పట్టా చేయడంలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని పురుగుల మందు తాగారు. విషయం తెలుసుకున్న పోలీసులు రంగంలో దిగారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వీరిద్దరూ సలుగుపల్లి గ్రామానికి చెందిన జనగం ఫకీరు, తిరుపతిగా గుర్తించారు. కుప్పకూలిపోయిన వీరిద్దరినీ బెజ్జురు ఆసుపత్రికి తరలించారు.