Congress: కాంగ్రెస్‌లో టికెట్‌ కోసం కీలక నేతల ప్రయత్నాలు.. ఒక నియోజకవర్గానికి ఒకే కుటుంబంలోని వ్యక్తుల పోటీ

Congress: కోదాడ నుండి ఉత్తమ్ సతీమణి ఉత్తమ్ పద్మావతిరెడ్డి దరఖాస్తు

Update: 2023-08-25 12:07 GMT

Congress: కాంగ్రెస్‌లో టికెట్‌ కోసం కీలక నేతల ప్రయత్నాలు.. ఒక నియోజకవర్గానికి ఒకే కుటుంబంలోని వ్యక్తుల పోటీ  

Congress: కాంగ్రెస్‌లో ఫ్యామిలీ ప్యాకేజ్ పాలిటిక్స్‌ ఊపందుకుంటున్నాయి. తమతో పాటు తమ కుటుంబసభ్యుల్లో ఎవరో ఒకరికి టికెట్ దక్కించుకునేందుకు విశ్వప్రయాత్నాలు చేస్తున్నారు కొందరు హస్తం పార్టీ నేతలు. మరో వైపు ఒక సెగ్మెంట్‌లో ఒకే కుటుంబంలోని వ్యక్తులు టికెట్ కోసం పోటీ పడుతున్నారు. ముషీరాబాద్ నుంచి అంజన్ కుమార్ యాదవ్, ఆయన కుమారుడు అనిల్ కుమార్ యాదవ్ దరఖాస్తు చేసుకున్నారు. కరీంనగర్ నుండి కేసీఆర్ అన్న కుమార్తె రమ్యా రావు, ఆమె కుమారుడు రితేశ్ రావు దరఖాస్తు చేసుకున్నారు.

జానా ఇద్దరు కుమారులు రఘువీర్ రెడ్డి, జయవీర్ రెడ్డి పోటీకి సిద్దయ్యారు. నాగార్జునసాగర్‌తో పాటు మిర్యాలగూడకూ దరఖాస్తు చేసుకున్నారు. అందోల్ నుండి దామోదర రాజానర్సింహాతో పాటు ఆయన కూతురు త్రిష దరఖాస్తు చేశారు. ములుగు నుండి ఎమ్మెల్యే సీతక్క పినపాక నుండి సీతక్క కుమారుడు సూర్యం దరఖాస్తు చేసుకున్నారు. హుజుర్ నగర్ నుండి ఉత్తమ్ కుమార్ రెడ్డి కోదాడ నుండి ఉత్తమ్ సతీమణి ఉత్తమ్ పద్మావతి రెడ్డి దరఖాస్తు చేశారు.

ఇలా ఒకే కుటుంబం నుంచి ఇద్దరు ఒకే నియోజకవర్గానికి దరఖాస్తు చేసుకుంటే.. రెండు నియోజకవర్గాలకు కూడా దరఖాస్తులు వచ్చాయి. మొత్తంగా వారసులతో పాటు కుటుంబసభ్యులను పోటీకి దించాలని పలువురు కీలక నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు.

Tags:    

Similar News