మాంసం ఎగుమతిదారు మొయిన్ ఖురేషీ కేసులో వ్యాపారవేత్త సానాసతీష్బాబు అరెస్టయ్యారు. సతీష్బాబు ను ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. గతంలో సీబీఐ స్పెషల్ డైరెక్టర్ రాకేష్ ఆస్తానాపై సతీష్ అవినీతి ఆరోపణలు చేశారు. సానా సతీష్ కు కేసు నుంచి విముక్తి కల్పించేందుకు రెండు కోట్ల రూపాయల లంచం తీసుకున్నారన్న ఆరోపణలపై కేసు నమోదు చేశారు. విద్యుత్ డిపార్ట్మెంట్లో ఏఈ పని చేసిన సతీష్బాబుకు వేల కోట్ల రూపాయలు ఎలా వచ్చాయన్న దానిపై సీబీఐ ఆరా తీయగా పలు కీలక విషయాలు వెల్లడించారు.