Secunderabad: సికింద్రాబాద్‌ బరిలో డాక్టర్ బస్వానందం

Secunderabad: బహుజనులు చట్టసభల్లో ఉంటేనే రాజ్యాధికారం సాధ్యం

Update: 2024-04-27 13:15 GMT

Secunderabad: సికింద్రాబాద్‌ బరిలో డాక్టర్ బస్వానందం

Secunderabad: బహుజనులు చట్టసభల్లో ఉంటేనే రాజ్యాధికారం సాధ్యమని ప్రముఖ హోమియోపతి డాక్టర్, సికింద్రాబాద్ బీఎస్పీ అభ్యర్థి దండెపు బస్వానందం అన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేస్తున్న ఆయన బిఎస్పీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. దేశంలో 90శాతం ఉన్న బహుజనులను ఓటు బ్యాంకుగానే చూస్తున్నారని విమర్శించారు డాక్టర్ బస్వానందం. రాజకీయాల్లో బహుజనులు అనాదిగా అణిచివేయబడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సికింద్రాబాద్ పార్లమెంట్ అభ్యర్థిగా తనను గెలిపిస్తే పార్లమెంట్‌లో బహుజనుల గొంతుక బలంగా వినిపిస్తానన్నారు బస్వానందం.

Tags:    

Similar News