హైదరాబాద్ అంబర్ పేట్ వద్ద మూసీ నదిలో గుర్తు తెలియని మృతదేహం లభ్యమైంది. ఉదయం గడ్డి కోయడానికి వెళ్లిన స్థానికులు మృతదేహాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్న పోలీసులు రెండు రోజుల క్రితం చనిపోయి ఉంటాడని ఒంటిపై గాయాలు ఏమీ లేవని తెలిపారు. మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. మృతుడి వివరాలు తెలియాల్సి ఉంది.